మన తెలుగు ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్, ఇమేజ్ సంగతి అందరికి తెలిసిందే. అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరు వరుస సినిమాలతో మంచి హుషారుగా ఉన్నారు. తాజాగా ట్రెండ్ కి తగ్గట్టు సినిమాలు ఓకే చేస్తున్నారు చిరు. ఫిలిం నగర్ లో ఇప్పుడు మల్టి స్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిరు కూడా ఇదే బాటలో నడవనున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. చిరంజీవి దర్శకుల లిస్టు లో ఉన్న యువ దర్శకుడు బాబీ ఈ మల్టీ స్టారర్ ని తెరకెక్కిస్తారని సినీ వర్గాల కథనం. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని మంచి మంచి కథలతో చిరు దగ్గరకు వస్తున్నారు దర్శకులు. అయితే ఇప్పుడు ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి తర్వాత సుజీత్ డైరెక్షన్ లో లూసిఫర్ అనే సినిమాకు రీమేక్ లో చిరంజీవి నటించనున్నట్టు తెలుస్తుంది. ఆ తరవాత బాబీ సినిమాను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దర్శకుడు బాబీసినిమా కథను చిరంజీవికి వినిపించినట్టు తెలుస్తుంది. దీని తో కథ నచ్చడంతో చిరంజీవి ఈ సినిమాకు ఓకే చేసినట్టు ఇండస్ట్రీ టాక్.     

 

ఈ మల్టీ స్టారర్ సినిమాకు ఒక హీరో చిరంజీవి కాగా మరొక హీరోగా రాణా దగ్గుబాటి పేరు తెరపైకి వచ్చింది. మెగా వారసుడికి ప్రాణ స్నేహితుడైన రాణా ను ఈ ప్రాజెక్ట్ లో భాగం చెయ్యాలని బాబి అనుకున్నారట. అయితే ఈ యువ దర్శకుడికి దగ్గుబాటి కుటుంబం తో కూడా సాన్నిహిత్యం ఉన్నందున కూడా రాణా ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే రాణా కు కథను వినిపిస్తారని తెలుస్తుంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: