ముందుగా ఇటీవల మూడేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది యువ భామ సాయి పల్లవి. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం ఈటివి ఛానల్ లో ప్రసారం అయిన ఢీ అనే డాన్స్ ప్రోగ్రాం లో ఒక పార్టిసిపెంట్ గా తన అదరగొట్టే డ్యాన్స్ లతో అలరించిన సాయి పల్లవి, తొలిసినిమా ఫిదా ద్వారా సూపర్ డూపర్ హిట్ ని తన సొతం చేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో సాయి పల్లవి అందం, నటన, డాన్స్ లు మన తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ కూడా మరిచిపోలేరు అనే చెప్పాలి. 

IHG

ఆ విధంగా తొలిసారిగా నటించిన సినిమా ద్వారానే ఎంతో పాపులరైన సాయి పల్లవి, ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించి మరింత మంచి పేరు సంపాదించింది. ఇక ఇటీవల అటు కోలీవుడ్ లో కూడా బడా స్టార్స్ సరసన కూడా అవకాశాలు అందుకుంటున్న సాయి పల్లవి, తెలుగు కంటే ముందుగా మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమా ద్వారా అక్కడ కూడా ఎంతో పాపులారిటీ సంపాదించింది. కాగా ఇటీవల కొద్దిరోజుల క్రితం తమిళ హీరో సూర్య సరసన ఆమె నటించిన ఎన్జీకే సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అలానే అటు తెలుగులో కూడా ఆమె సినిమా రిలీజ్ అయి రెండేళ్లు కావొస్తోంది. అయినప్పటికీ కూడా మన ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యువతలో సాయి పల్లవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

IHG

ఇక ప్రస్తుతం తెలుగులో ఆమె నటిస్తున్న సినిమాల్లో ఒకటి నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ ఒకటి కాగా,  రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం మరొకటి. కాగా నేడు తన 28వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న సాయి పల్లవి కి జన్మదిన శుభాకాంక్షలు చెపుతూ ఆ రెండు సినిమాల యూనిట్స్ వారు ఆమెకు సంబంధించి లేటెస్ట్ పోస్టర్లను తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు సినిమాలు కూడా రేపు రిలీజ్ తరువాత మంచి హిట్ సాధిస్తే, హీరోయిన్ గా సాయి పల్లవి రేంజ్ మరింతగా పెరగడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: