టాలీవుడ్ లో లెక్కల మాస్టారు లెక్కే వేరుగా ఉంటుంది. ఆయనే సుకుమార్. ఒక హీరోని ఎంత స్టైలిష్ గా చూపిస్తాడో అంత మాసీగాను చూపిస్తాడు. అందుకు ఉదాహరణలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వన్ నేనొక్కడిలో మహేష్ బాబు అలాగే నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ లను ఎంత క్లాస్ గా చూపించాడో అందరికి తెలిసిందే. ఇక రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో యాక్షన్ క్రైమ్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. పుష్ప అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 2020 సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇక అయిదు భాషల్లో భారీ పాన్ ఇండియా సినిమాగా పుష్ప సినిమాని తెరకెక్కిస్తుండగా కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

 

అయితే ఈ సినిమా తరువాత సుకుమార్ మరోసారి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ ని నమోదు చేసుకున్న సంగతి తెలిసందే. ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కించిన ఈ సినిమాతో సుకుమార్ కంటెంట్ ఎన్.టి.ఆర్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. అంతేకాదు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో పెద్ద ఎసెట్ గా నిలిచింది.

 

దాంతో ఇప్పుడు సుకుమార్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నాడు. కొమరం భీం పాత్రలో కనిపించనున్న ఎన్.టి.ఆర్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అయినను పోయిరావలె హస్తినకు అన్న సినిమాలో నటిస్తాడు. ప్రస్తుతం త్రివిక్రం ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ముందు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో త్వరలో క్లారిటి రానుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: