మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా దంగల్. ఈ సినిమా బాలీవుడ్ లో సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాదు చైనాలోను ఈ సినిమా రికార్డ్ ల మోతమోగించింది. అమీర్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన ఈ సినిమాను యు.టి.వి మోషన్ పిక్చర్స్ సమర్పించారు. బయోపిక్స్ లో వచ్చిన సినిమాలన్నిటికంటే దంగల్ సినిమా ఎంతో ప్రత్యేకతను చాటుకుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ను వరసగా బయోపిక్స్ ని నిర్మించారు ..ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు.

 

ప్రస్తుతం ప్రస్తుతం మన భారతీయులకు ఎంతో ఇష్టమైన క్రికెటటర్ కపిల్ దేవ్. మన ఇండియన్ క్రికెట్ టీం కు మొట్టమొదటి సారి ప్రపంచ కప్ ను అందించిన సారధి కపిల్ దేవ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో ఆయన జీవిత చరిత్రపై సినిమాని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా “83 ది ఫిల్మ్” టైటిల్ తో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కపిల్ పాత్ర పోషిస్తుండగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆగిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా కోసం యావత్ భారత దేశం లోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

 

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణే హీరోయిన్ గా నటిస్తుంది. క్రికెటర్ శ్రీకాంత్ రోల్ లో జీవా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ తీసేయగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మీద బాలీవుడ్ లో నడుస్తున్న టాక్ ప్రకారం అమీర్ ఖాన్ దంగల్ కంటే ఎక్కువ వసూళ్ళని రాబట్టనుందని. రికార్డ్స్ లో ఆ సినిమాని బీట్ చేస్తుందని చర్చించు కుంటున్నారట. ఇక ఈ సినిమాతో పాటు ప్రముఖ బ్యాట్‌మెంటన్ సైనా నెహ్వాల్ బయోపిక్ ని రూపొందిస్తున్నారు. ఈ బయోపిక్ లో పరిణితి చోప్రా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: