కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమిళంలో పాటు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే గత కొంతకాలంగా సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటంతో రేస్ లో కాస్త వెనక బడ్డాడు. దాంతో తెలుగులో సూర్య మార్కెట్ బాగా పడిన సంగతి తెలిసిందే. ఈ ఇయర్ సూర్య నటించిన "NGK", "బందోబస్త్" సినిమాలైతే దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం సూర్య "గురు" ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో "సూరారై పొట్రు" అనే తమిళ సినిమాలో నటించాడు. ఈ సినిమా తెలుగులో "ఆకాశమే నీ హద్దురా" అనే టైటిల్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 

 

ఇక ప్రస్తుతం భారీ మార్కెట్ తో పాటు వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న మరో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి  ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "మాస్టర్". లోకేష్ కనగరాజన్ తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కి ముందే 200 కోట్ల బిజినెస్ కూడా అయిందని కోలీవుడ్ మీడియా సమాచారం.

 

అయితే సూర్య, విజయ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ మద్య తమ సినిమాలని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. వాస్తవంగా సూర్య తన సినిమాలను ఓ.టీ.టీ లో డైరెక్ట్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. కాని సూర్యకి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. దాంతో తన సినిమాని లాక్ డౌన్ తర్వాత రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు విజయ్ కూడా అదే రోజు తన సినిమాని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు.

 

మరి ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కుంటారో చూడాలి. అయితే విజయ్ మాత్రం తన సినిమాలని ఎటువంటి పరిస్థితిలోను ఓ.టీ.టీ లో రిలీజ్ చేసే ఉద్దేశ్యం లేదని లేటయినా థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని రీసెంట్ గా క్లారిటి ఇచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: