పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తీసుకొని రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్' 'ఎంసీఏ' చిత్రాల డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని బడా నిర్మాతలు దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రాన్ని బడా నిర్మాత ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్య కాలంనాటి ముఖ్యమైన సంఘటనలతో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.

 

పవర్ స్టార్ ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన అనంతరం వచ్చే ఏడాది తన కెరీర్లో 28వ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు. కాగా డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని.. అన్నీ కుదిరితే 2021 చివర్లో సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట. పవన్ - డాలీ మధ్య సినిమాకి సంబంధించి ఎలాంటి చర్చ కూడా జరగలేదట. అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం పవన్ ను అప్రోచ్ అయ్యారని, కానీ పవన్ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదని తెలుస్తోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చి ఇలా వరుస సినిమాలను లైన్లో పెడుతుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: