‘భీష్మ’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న హీరో నితిన్ జోరు మీద ఉన్నారు. అదే ఊపులో యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భీష్మ' చిత్రం హిట్ కావడంతో నితిన్‌ - నాగవంశీ కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. నితిన్ - కీర్తి సురేష్‌లు తొలిసారి ఈ ఇద్దరూ కలిసినటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకి హిట్ డైరెక్టర్ అని నిరూపించుకోవడానికి ఆరాటపడుతున్న వెంకీ అట్లూరి డైరెక్టర్ కావడంతో నితిన్ ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారట. కాకపోతే నితిన్ - కీర్తి సురేష్ జోడీని నమ్ముకొని ఉన్నారట. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకున్న 'రంగ్ దే' త్వరలోనే మళ్ళీ చిత్రీకరణ స్టార్ట్ చేయబోతోంది. 

 

ఇదిలా ఉండగా దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో రాబోతున్న ‘పవర్‌ పేట’ అనే సినిమాలో నితిన్ నటించనున్నాడట. అయితే ఈ సినిమాలో నితిన్ మూడు గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం. పైగా ఈ సినిమాలో నితిన్ 18 ఏళ్ల యువకుడిగా.. అలాగే 40 ఏళ్ల వ్యక్తిగా.. 60 ఏళ్ల ముసలాడిగా కూడా కనిపించబోతున్నాడు. మొత్తానికి ‘పవర్ పేట’ నితిన్ కెరీర్ కే స్పెషల్ ఫిల్మ్ గా నిలుస్తోందట. కృష్ణ చైతన్య రాసుకున్న స్క్రిప్ట్ వైవిధ్యంగా ఒక రెండు మూడు సినిమాలుగా తీసే రేంజ్ లో ఉండబోతోందని.. అందుకే ఈ సినిమాని రెండు పార్టులుగా తీయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కథ 1960 – 2020 వరకూ నడుస్తోందట. అన్ని కుదిరితే డిసెంబర్ నుండి ‘పవర్‌ పేట’ షూటింగ్‌ ను మొదలుకానుంది. ఇదే కనుక నిజమైతే నితిన్ కెరీర్‌లో ఈ సినిమా వైవిధ్యమైన సినిమాగా మిగిలిపోతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: