టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అతి కొద్ది మంది మాత్రం టాలీవుడ్ లో చాలా కాలం వరకు తమ కెరీర్ కొనసాగించారు. అయితే తెలుగు, తమిళంలో మంచి విజయాలు అందుకున్న వారు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ఫెయిల్ అయ్యారు. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే తెలుగు లో వచ్చిన ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించింది. ఈ రెండు మూవీస్ లో ఈ అమ్మడికి ఏమాత్రం గ్లామర్ ప్రదర్శన చేయడానికి ఛాన్స్ దొరకలేదు. దాంతో సక్సెస్ కూడా కలిసి రాలేదు. ఇక లాభం లేదనుకొని బాలీవుడ్ కి వెళ్లిపోయింది.. కానీ అక్కడ కూడా సక్సెస్ సాధించలేదు.
అయితే ఈ అమ్మడికి ఎవరూ ఊహించని అదృష్టం ‘దువ్వాడ జగన్నాథం’ మూవీతో కలిసి వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో బ్లాక్ బికినీ సీన్లోరెచ్చిపోయి నటించింది. అంతే ఈ బ్యూటీ అందాలకు ప్రేక్షకులే కాదు.. దర్శక, నిర్మాతలు ఫిదా అయ్యారు. ‘మహర్షి’తో ఆహా అనిపించుకుని, ‘అల వైకుంఠపురములో’ అంటూ అందర్నీ అలరించింది. ఇప్పుడు ఇండస్ట్రీ స్టార్ హీరోలందరి చూపు అమ్మడిపైనే అంటే ఒప్పుకోకతప్పదు. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు, హిందీ భాషల్లో బీజీగా మారిపోయింది. దక్షిణాదిన అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న పూజా హెగ్డే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి సిద్ధమే కానీ అది ఇప్పుడే కాదంటుంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం ఇష్టం లేదా అంటే.. చాలా తెలివైన సమాధానం చెప్పింది. తనకు అలాంటి పాత్రలు చేయడం నాకూ ఇష్టమే. ఒక నటిగా నన్ను మరో కోణంలో అది చూపిస్తుంది. ఆ మద్య ఓ మూవీ ఛాన్స్ వచ్చింది.. నాకు నచ్చక చేయలేదు. లవర్ పాత్రలు, గ్లామర్ పాత్రలు ఇప్పుడు మాత్రమే చేయగలను. భవిష్యత్ లో తప్పకుండా చెస్తానని చెప్పింది.