టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బడా నిర్మాతల్లో దిల్ రాజు. తాను నిర్మించిన 'దిల్' సినిమాతో 'దిల్ రాజు'గా మారిపోయిన వెంకట రమణా రెడ్డి టాలీవుడ్‌ లో తిరుగు లేని నిర్మాతగా కొనసాగుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి వరుస చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణా రెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేసాడు. కాగా మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. దీంతో మరో పెళ్లి చేసుకోమని కుటుంబ సంభ్యులు, సన్నిహితులు ఎప్పటినుండో కోరుతూ ఉండటంతో దిల్ రాజు రెండో వివాహానికి అంగీకరించారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ‘దిల్ రాజు’ ఈ రోజు రాత్రి వివాహం చేసుకోబోతున్నారట. తన స్వస్థలమైన నిజామాబాద్‌ లోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో దిల్ రాజు వివాహం జరగనుంది. ప్రభుత్వ సూచనల మేరకు ఈ వివాహానికి కేవలం 10 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవ్వనున్నారట.

 

ఇదిలా ఉండగా దిల్ రాజు తన వివాహం పై స్పందించారు. తన పెళ్లి పై దిల్ రాజు స్పందిస్తూ స్వయంగా సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేశారు. ''ప్రస్తుతం ఈ ప్రపంచం ఎదురుకుంటున్న పరిస్థితులను ఎవ్వరూ జీర్ణించుకోలేపోతున్నాము. ఇలాంటి కష్ట సమయంలో వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందుల నుండి త్వరగా కోలుకోలేము. ఇక వ్యక్తిగతంగానూ నాకు గత కొన్ని రోజుల నుంచి మంచి టైమ్ రాలేదు. అంతా త్వరలోనే సర్దుకుంటుందని, అందరికీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. అదే ఆశతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. అందుకు ఇదే అదునైన సమయంగా భావిస్తున్నాను'' అని దిల్ రాజు పోస్ట్ చేసారు. దీంతో అందరూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 

Image

మరింత సమాచారం తెలుసుకోండి: