టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కలిసి ఉందా విదిపోయిందా అనే దాని మీద ఎప్పటికప్పుడు ఏదోక చర్చ జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎవరికి వారు గా ఏదోక ప్రచారం చేస్తూనే ఉంటారు. చిన్న లింక్ దొరకగానే దానికి అనేక రకాల లింక్ లు పెట్టి నానా ప్రచారాలు చేస్తూ బాధపడతారా లేదా అనే దానిని కూడా కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయరు జనాలు. దీని మీద ఎవరు ఎన్ని విధాలుగా వార్నింగ్ లు ఇచ్చినా సరే చాలా మంది లో మార్పు అనేది పెద్దగా వచ్చే అవకాశాలు కనపడటం లేదు. 

 

ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అది ఏంటీ అంటే మెగా హీరోలు ముగ్గురు విడిపోయారని... అదే మెగా బ్రదర్స్... పని లేని వాళ్ళు మొదలు పెట్టిన ఈ ప్రచారానికి మీడియా కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఇవ్వడం తో అది కాస్త ఎక్కువగానే జనాల్లోకి వెళ్ళింది అనేది వాస్తవం. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ఫోటో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అదే విధంగా తన తల్లికి ముగ్గురు బ్రదర్స్ శుభాకాంక్షలు చెప్పేది కూడా షేర్ చేసారు 

 

వీడియో ని ముగ్గురు ఉండే విధంగా రూపొందించి దాన్ని సోషల్ మీడియాలో ఆయనే స్వయంగా విడుదల చేసారు. దీనితో ఇప్పుడు కొందరు ఒక ప్రచారం మొదలు పెట్టారు. ఆ ముగ్గురిని తల్లి కలిపారు అని అందుకే ఈ వీడియో చేసారు అంటూ లేని పోనీ వార్తలను ప్రచారంలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు ఉన్నా లేకపోయినా సరే ఎవరి పని వాళ్ళది అంటూ సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోయే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: