టాలీవుడ్ స్టార్ రైటర్స్ లో వక్కంతం వంశీ ఒకరు. స్టార్ హీరోలకు కథలను అందించిన ఆయన దర్శకుడిగా చేసిన మొదటి ప్రయత్నం నా పేరు సూర్య. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరియర్ లో  చాలా కష్టపడ్డ సినిమా  కూడా అదే అని చెప్పొచ్చు. వక్కతం వంశీ రైటర్ సూపర్ హిట్. డైరక్టర్ గా కూడా దుమ్ముదులిపేస్తాడని అనుకున్నారు. కానీ నా పేరు సూర్య అంచనాలను అందుకోలేదు. సినిమా కోసం బన్నీపడిన కష్టం అంతా వృధా అయ్యింది. 


రైటర్ నుండి డైరక్టర్ గా ప్రమోట్ అయిన వంశీ తర్వాత రైటర్ గా కూడా కథలు ఇవ్వలేదు. మళ్ళీ డైరక్టర్ గానే తన సత్తా చాటాలని చూస్తున్న వంశీకి ఛాన్స్ ఇవ్వడానికి స్టార్స్ ఎవరు ముందుకు రాలేదు. లేటెస్ట్ గా వక్కంతం వంశీకి హీరో దొరికాడని అంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ వంశీకి ఛాన్స్ ఇస్తున్నాడట. ఈమధ్యనే వంశీ రాసిన కథను రవితేజకు వినిపించడం మాస్ రాజా ఆ కథను ఓకే చేయడం అంతా జరిగిందట. ఫైనల్ గా వంశీ రెండో ప్రాజెక్ట్ త్వరలో స్టార్ట్ అవనుంది. 


రైటర్ గా సూపర్ హిట్ అయినా వక్కంతం వంశీ డైరక్టర్ గా మాత్రం మొదటి సినిమాకే నిరాశపరిచాడు. అందుకే రెండో సినిమా ఈసారి కొడితే హిట్టే కొట్టాలన్న కసితో రాసుకున్నట్టు తెలుస్తుంది. రవితేజ కూడా ప్రస్తుతం చేస్తున్న గోపీచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ సినిమా ఉండొచ్చని టాక్. మొత్తానికి రవితేజ, వక్కంతం వంశీ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎలాంటి సంచలనాలు సృస్తిస్తుందో చూడాలి.                               

మరింత సమాచారం తెలుసుకోండి: