రాజమౌళి మీద ఆడియన్స్ కి అంత నమ్మకం. ఇపుడున్న డైరెక్టర్లు తాము కధలను ఎంచుకుని సినిమాలు తీస్తారు. అవి బాగుంటే జనం చూస్తారు. లేకపోతే లేదు. కానీ ఒక సూపర్ స్టార్ ని మించిన క్రేజ్ మాత్రం డైరెక్టర్లలో రాజమౌళికి మాత్రమే ఉంది. ఇక రాజమౌళి ఎంచుకున్న కధలు, సినిమాలు ఒక ఎత్తు.

 

ఆయన ఇప్పటివరకూ తీసిన పన్నెండు సినిమాలు సూపర్ హిట్లు. ఇక రాజమౌళి మదిలో ఏ ఆలోచనలు ఉన్నాయో తెలియదు కానీ ఆడియన్స్ మాత్రం కొన్ని సినిమాలు తీయాలంటే ఒక్క రాజమౌళి వల్లనే అవుతుందని చెప్పడం విశేషం. ముఖ్యంగా  పౌరాణిక సినిమాలు తీస్తే రాజమౌళి మాత్రమే తీయాలని అంటున్నారు.

 

రామాయణం, భారతం వంటి సినిమాలు తీసే సత్తా రాజమౌళికి మాత్రమే ఉందని నెటిజన్లతో పాటు  సామాన్య జనం కూడా నమ్ముతున్నారు. ఆ సినిమాల్లో పాత్రలు, కధను విజువల్ వండర్ గా  డిజైన్ చేయడం ఒక్క రాజమౌళి వల్లనె సాధ్యపడుతుందని అంటుననరు. అది కూడా నిజమే రాజమౌళి ఇప్పటి జనరేషన్ పల్స్ పట్టేశారు. వారికి ఏది నచ్చుతుంది అన్నది ఆయనకు తెలుసు. ఆ విధంగానే ఆయన సినిమాలు తీస్తున్నారు. హిట్లు కొడుతున్నారు.

 

ఇక మహా భారతాన్ని తీస్తాను అని ఇప్పటికే రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను రిటైర్ అయ్యేలోగా తీసే అతి భారీ డ్రీం ప్రాజెక్ట్ అదేనని కూడా అంటున్నారు. ఇక ఆయనకు ఇపుడు మరో కొత్త ప్రాజెక్టుని కూడా జనం తగిలిస్తున్నారు.

 

అదే రామాయణం. మరి రామాయణం మూవీ కనుక రాజమౌలి టేకప్ చేస్తే మరో వందేళ్ళ పాటు చెప్పుకునేలా  ఆ బొమ్మను తీస్తాడని గట్టిగా చెప్పవచ్చు. మరి రాజమౌళి ఈ రెండు పురాణ గాధలను తెరకెక్కించి కానీ రిటైర్ అవనని ఆడియన్స్ కి మాటిస్తే బాగుంటుందేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: