టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. మహేష్ బాబు అంటే పరిచయం అవసరం లేని పేరు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టినా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు. కెరీర్ మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలతో అశేషమైన ఫ్యాన్స్ ని సంపాదించాడు. కమర్షియల్ సినిమాలతో ఇప్పుడు మంచి ఫాంలో ఉన్న సూపర్ స్టార్ ఇప్పుడు సరికొత్తగా బిజినెస్ మ్యాన్ అవతార మెత్తాడు. అంతేకాక మిగతా హీరోల సినిమాలకు నిర్మాతగా కూడా మారబోతున్నాడు. 

 

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మహేష్ బాబు హవా నడుస్తుంది. ఈ నేపధ్యంలో ఆయన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి అనే తీరుగా వ్యవహరిస్తున్నారని సనిహిత వర్గాల మాట. దీనికి గాను మహేష్ పలు వ్యాపారాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెడుతూ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ఇంకా మల్టీ ప్లేక్స్  ఓపెన్ చేసి థియేటర్స్ చైన్ సిస్టం లోకి దిగారు. ఎంబి ప్రొడక్షన్ పేరుతో తన సినిమా లన్నిటిలోనూ భాగస్వామిగా వ్యవహరిస్తూ హీరోగానే కాకుండా బిజినెస్ మ్యాన్ గా కూడా సక్సెస్ అయ్యారు.

 

ఇప్పటి వరకు తన సినిమాలకు మాత్రమే నిర్మాతగా ఉన్న మహేష్ ఇప్పుడు బయటి హీరోల సినిమాలు తీయడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో అడవి శేష్ హీరోగా వస్తున్న మేజర్ సినిమాకు గాను నిర్మాతగా మారాడు. తరవాత సినిమా విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చెయ్యాలని ప్లాన్ చేసినట్టు సినీ జనాల్లో చర్చ జరుగుతుంది. ఇవే కాక తమిళంలో కార్తి తో ఒక సినిమా నిర్మించేందుకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అటు హీరోగా, ఇటు నిర్మాతగా కూడా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ అని ఇండస్ట్రీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: