లాక్ డౌన్ దెబ్బకి టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. ఈ వేసవి సీజన్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి భారీ నష్టాన్ని కరోనా వైరస్ రూపంలో తెచ్చింది. సినిమా థియేటర్లకు కేంద్రం నుండి అనుమతులు రాకపోవడంతో మరోపక్క షూటింగులు కూడా ఆగిపోవటంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల షూటింగులు మొత్తం అన్ని ఆగిపోవడంతో ఎవరికి వారు వేసుకున్న ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి. భారీ బడ్జెట్ సినిమాలు అదేవిధంగా లోబడ్జెట్ సినిమాలు అనే తేడా లేకుండా ఆగిపోయాయి.  అదే రీతిలో స్టార్ హీరో, మామూలు హీరో అనే తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

 

ఇటువంటి సమయంలో  మెగా ఫ్యాన్స్ కి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. ఏమిటంటే ఈ ఏడాది మెగా కాంపౌండ్ నుంచి ఏ హీరోల సినిమాలు అయితే వస్తాయి అని ఫాన్స్ అనుకుంటున్నారో వాళ్లకు సంబంధించిన సినిమాల రిలీజ్ డేట్లు మారిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ సినిమాని తెలుగులో వకిల్ సాబ్ టైటిల్ పేరిట రీమేక్ చేస్తున్నారు.

 

మే నెలలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా...సినిమాకి సంబంధించి దాదాపు షూటింగ్ సగానికి పైగా పూర్తయిన గాని ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయనున్నారట. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమా కూడా వచ్చే ఏడాది జులై గాని లేకపోతే వచ్చే ఏడాది చివరాఖరున్న సినిమా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అల్లు అర్జున్ మరియు చిరంజీవి ఇంకా మెగా కాంపౌండ్ లో ఉన్న కుర్ర హీరోల సినిమాలన్నీ వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: