టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.దర్శకుడిగా తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ కొట్టి పూరికి విపరీతమై పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టడం జరిగింది. అయితే ఆ తరువాత జగపతిబాబు తో పూరి తీసిన బాచి మాత్రం ఫ్లాప్ అయింది. అనంతరం కొంత జాగ్రత్తగా ఆలోచించి నటుడు రవితేజ ని హీరోగా పెట్టి పూరి తీసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఆపై ఇడియట్, అనంతం అమ్మానాన్న ఒక తమిళ అమ్మాయి సినిమాలు ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాలు అందుకోవడం జరిగింది. ఇక ఆ సినిమాల విజయాలతో పూరికి విపరీతంగా పేరు వచ్చింది. 

 

ఆపై ఆంధ్రావాలా, సూపర్ సినిమాలతో పెద్దగా సక్సెస్ లు అందుకోలేని పూరి, వాటి అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన పోకిరి సినిమా అప్పట్లో ఊహించని రేంజ్ లో 75 ఏళ్ళ కెరీర్ లో నిలిచిపోయే ఇండస్ట్రీ హిట్ ని కొట్టడంతో పాటు హీరోగా మహేష్ కు అలానే దర్శకుడిగా పూరికి ఎంతో గొప్ప క్రేజ్ తెచ్చిపెట్టడం జరిగింది. కాగా ఆ సినిమా తరువాత పూరి కి ఆదాయం కూడా బాగానే వచ్చినట్లు సమాచారం. ఇక ఆ తరువాత ఆయన తీసిన దేశముదురు, చిరుత సినిమాలు కూడా సక్సెస్ కొట్టడంతో పూరి, టాలీవుడ్ లో తిరుగులేని డైరెక్టర్ గా దూసుకెళ్లాడు. కాగా ఆ తరువాత నుండి బుజ్జిగాడు, బిజినెస్ మ్యాన్ సినిమాలు తప్ప దాదాపుగా పూరి తీసిన సినిమాలు అన్ని కూడా బోల్తా కొట్టాయి. 

 

ఇక ఇటీవల ఎట్టకేలకు ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో పూరి తీసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ హిట్ కొట్టి, దర్శకుడిగా ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. దాని అనంతరం ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫస్ట్ టైం ఒక భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్న పూరి, మళ్ళి పోకిరి రేంజ్ హిట్ కొట్టగలడా అని కొందరు టాలీవుడ్ ప్రేక్షకులు అంటున్నారు. అయితే పూరి మనసు పెట్టి మంచి స్టోరీ రాస్తే తప్పకుండా మళ్ళి పోకిరి రేంజ్ హిట్ ఆయనకు దక్కుతుందని, అన్నీ కలిసి వస్తే విజయ్ తో ఆయన ప్రస్తుతం తీస్తున్న సినిమా ఆ రేంజ్ అందుకోవచ్చని పూరి ఫ్యాన్స్ కొందరు అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: