స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పుష్ప'. సక్సస్ ఫుల్ చిత్రాలని అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'ఆర్య'..  'ఆర్య2' తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతుంది. అల వైకుంఠపురములో సినిమాతో రికార్డ్స్ క్రియోట్ చేసిన అల్లు అర్జున్ ఈసారి పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని దక్కించుకోవడానికి రెడీ అవుతున్నాడు. 

 

శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమా కథ ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ రాయలసీమ యాసలో మాట్లాడతాడని తెలుస్తుంది. అదే సినిమాకి పెద్ద హైలెట్ కానుందట. అంతేకాదు మాస్ గెటప్ లో అల్లు అర్జున్ బాడ్ లాంగ్వేజ్ కూడా సినిమాకి అడిషనల్ అట్రాక్షన్ అంటున్నారు. రంగస్థలం సినిమా కి ముందు వరకు సుకుమార్ తీసిన సినిమాలు చాలా స్టైలిష్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాని రంగస్థలం సినిమా నుండి తన పంథా మార్చాడు. పుష్ప కూడా అలాంటి మాస్ బ్యాగ్డ్రాప్ లో రూపొందడం విశేషం. ఇక ఈ సినిమాని తెలుగు-హిందీ-తమిళం- మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.  

 

ఇక రంగస్థలం తో సుకుమార్.. అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ సక్సస్ లని అందుకొని ఉండటం తో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు అల్లు అర్జున్-సుకుమర్-దేవీ శ్రీప్రసాద్ మ్యాజిక్ కూడా సినిమాకి బాగా కలిసొచ్చే అంశం అని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ బ్యాగ్డ్రాప్ లో వచ్చే సీన్స్ అన్ని ఎంతో ఉత్కంఠతతో ఉంటాయట. అంతేకాదు ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమని మరోసారి టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ ని తిరగ రాయడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు. అందుకు ప్రధానంగా మూడు కారణాలు.. ఈ సినిమా కథ, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, సుకుమార్ మేకింగ్ అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: