నటరత్న నందమూరి బాలకృష్ణ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోస్ట్ పవర్ ఫుల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారని సమాచారం. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' 'లెజెండ్' సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కరోనా లాక్‌ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

 

ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నారని.. అందులో ఒకటి అఘోర పాత్ర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ రూమర్ వినిపిస్తోంది.

 

ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించనున్నాడట. అతనెవరో కాదు మాజీ హీరో తొట్టెంపూడి వేణు. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం వేణు ని సంప్రదిస్తున్నారట చిత్ర యూనిట్. వేణు ఇప్పటికే బోయపాటి 'దమ్ము' సినిమాలో ఎన్టీఆర్ కి బావగా నటించిన సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్స్ గురించి కూడా డైలీ ఒక రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. అయితే ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. ఇప్పటికే ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసామని.. సరైన టైమ్ లో వాళ్లలో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మధ్య వరుస ప్లాపుల్లో ఉన్న బాలయ్యని బోయపాటి మరోసారి గట్టెక్కిస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: