ప్రస్తుతం డార్లింగ్‌ ప్రభాస్ దర్శకుడు krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్ర షూటింగ్ కొంత వ‌ర‌కు జార్జియాలో పూర్తి చేసుకుంది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌కి గ్యాప్ వ‌చ్చింది. సినిమా చిత్రీకరణ దశలో ఉండగా లాక్ డౌన్ అనంతరం షూటింగ్ తిరిగి మొదలుకానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మొత్తం యూరప్ నేపథ్యంలో సాగనుంది. మెచ్యూర్డ్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ఉండనుందని సమాచారం. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ నాగ్ అశ్విన్ తో క‌లిసి  ఓ మూవీని చేసేందుకు  ఒకే చేశారు.

 

ఇక ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. అశ్వినీ దత్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ భారీ చిత్రం ఏ జోనర్ లో రానుంది? కథ ఏమై ఉంటుంది అనే ప్రశ్నలు మూవీ ప్రకటించిన నాటినుండి ఫ్యాన్స్ లో ఉన్నాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం ఇది ఓ సోషియో ఫాంటసీ చిత్రంగా తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచాం.  సామాన్య మానవుడు, దేవకన్యకు పుట్టిన ఓ వన్‌డ‌ర్‌ కిడ్ స్టోరీనే ఈ చిత్ర‌మ‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్దిరోజులు ఇంకా ఆగాల్సిందే.

 

క‌రోనా ఎఫెక్ట్ క‌నుక ప‌డ‌క‌పోయుంటే ఈ పాటికే ఈ చిత్ర వివ‌రాల‌న్నీ కూడా తెలిసేవి. ఇండ‌స్ట్రీ మీద ఈ ఎఫెక్ట్ కాస్త ఎక్కువ‌గానే ప‌డింది. ఆర్ధికంగా కూడా సినీ ఇండ‌స్ట్రీ చాలానే న‌ష్ట‌పోయిన‌ట్లు ఇదంతా కోలుకోవ‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టేట‌ట్టే ఉంది. అలాగే సినిమాలు షూటింగ్‌లు పూర్త‌యిన‌ప్ప‌టికీ కూడా విడుద‌ల అయినా ప్రేక్ష‌కుల థియేట‌ర్ల‌కు ఏమాత్రం వ‌స్తారో కాస్త అనుమాన‌మే. మ‌రి నిర్మాత‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: