టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో అడుగు పెట్టి మహానటి తో ప్రభంజనం సృష్టించింది కీర్తి సురేష్. నిర్మాత సురేష్, నటి మేనక ల కూతురు కీర్తి. ఏ విధమైన స్కిన్ షో చేయక పోయిన అశేష అభిమానులను సంపాదించింది. ఇక మహానటి తర్వాత నుండి వరుసగా అవకాశాలతో కెరీర్ లో దూసుకుపోతుంది. తెలుగులోనే కాక తమిళ, హింది చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా సినిమాలో నటిస్తుంది. కరోన కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ నేపధ్యంలో ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసింది.

 

కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా సినిమా వేసవి సెలవులలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించారు. కాని కరోనా కారణంగా వాయిదా పడింది. విలక్షణ డైరెక్టర్ నగేష్ దర్శకత్వం లో ఈ సినిమా చేస్తుంది కీర్తి. అయితే కథ నచ్చి మధ్యలో దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్ లో విలీనం అయ్యారు. దిల్ రాజు చేతికి మారాక ఈ సినిమాని తమిళం, తెలుగు రెండు భాషలలోను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండు భాషలకు వర్తించే విధంగా సినిమా టైటిల్ గుడ్ లక్ సఖి అని మార్చారు. 

 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని చాలా వరకు పూర్తి చేసారు డైరెక్టర్ నగేష్. అయితే లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే మిగిలిన షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకు రాబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ పనిలో దిల్ రాజు కూడా కలిసినందుకు ఈ సినిమా పై అభిమానుల్లో, ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ గుడ్ లక్ సఖి చిత్రం కీర్తికి ఎంత వరకు లక్ తెచ్చి పెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: