ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్దం అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది అనేది వాస్తవం. అసలు విషయం అనేది పక్క దారి పట్టి కొసరు విషయాలు ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే... స్టార్ హీరోయిన్ కి కరోనా వచ్చింది అని ప్రచారం జరుగుతుంది. కరోనా లక్షణాలు ఉన్నాయని ముంబై ఆస్పత్రికి వెళ్ళింది అంటున్నారు. ఈ విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో అనేక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. 

 

హీరోయిన్ ఎవరు అనేది పక్కన పెడితే ఆమె తెలుగులో నిన్నటి వరకు స్టార్ హీరోయిన్ అని ... ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సినిమా పని మీద అక్కడికి వెళ్ళింది అని, లాక్ డౌన్ కారణంగా ఆమె అక్కడ ఉండిపోవడం ఆ తర్వాత చిన్న చిన్న అవసరాల కోసం బయటకు రావడం తో ఆమెకు కరోనా లక్షణాలు బయట పడ్డాయి అని స‌మాచారం. ఈ విష‌యం కొద్ది రోజుల పాటు ఆమె గోప్యంగా ఉంచినా చివ‌ర‌కు అది బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి అట‌.

 

ఏదేమైనా సెల‌బ్రిటీ ల విష‌యంలో ఏ చిన్న వార్త అయినా ఎంత‌లా స్ప్రెడ్ అవుతుందో ఇదే పెద్ద నిద‌ర్శ‌నం. నిజం అనేది తెలియకుండా ఎక్కువగా వార్తలను షేర్ చేసే సోషల్ మీడియా యూజ‌ర్లు దీనిని ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ఇటీవల ఒక హీరోయిన్ కి కూడా ఇలాగే కరోనా అని ప్రచారం చేయగా పాపం ఆ హీరోయిన్ స్పందించి నాకు అదేమి లేదు నేను బాగానే ఉన్నాను అని స్పష్టత ఇవ్వడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

 

ఇక క‌రోనా విష‌యంలో సౌత్ టు నార్త్ వ‌ర‌కు అన్ని భాష‌ల‌కు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇంట్లో చేసిన ప‌నుల వీడియోలు షేర్ చేస్తూ అభిమానుల‌ను ఖుషీ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: