మన తెలుగు హీరోలు ఇప్పుడు సినిమాల కోసం నానా కష్టాలు పడుతున్నారు. సినిమా ఒక్కటి వచ్చినా చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు. సినిమాలు చేస్తున్న నిర్మాతలు కూడా భారీగా నష్టపోతున్నారు. దీనితో ఇప్పుడు హీరోలు అందరూ కూడా రంగం లోకి దిగారు. టాలీవుడ్ లో ఇప్పుడు షూటింగ్ లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని భావించిన హీరోలు తమ నిర్మాతలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. హీరో లు అందరూ కలిసి సినిమాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసే ఆలోచనలో ఉన్నారు. 

 

హీరోలు అందరూ కూడా ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వానికి లేఖ రాసి తమ నిర్మాతల కష్టాలను వివరించాలి అని భావిస్తున్నారు. చిన్న చిన్న నిర్మాతలు అయితే ఆస్తులను అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారని అగ్ర నిర్మాగ్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత బాగుంటే సినిమా బాగుంటుంది కాబట్టి సినిమాల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణా సర్కార్ లేఖ రాసే అవకాశాలు ఉన్నాయని రాబోయే రెండు మూడు రోజుల్లో లేఖ రాసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. 

 

మరి లేఖ రాస్తారా లేదా అనేది చూడాలి. మూడో విడత లాక్ డౌన్ మరో వారం రోజుల్లో ముగుస్తుంది కాబట్టి  ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ ని పెంచే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా లైన్ క్లియర్ చెయ్యాలని భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో హీరోలు అందరూ కలిసి ఇప్పుడు లేఖ రాయడానికి సిద్దమవుతున్నారు. ప్రభాస్ ఇప్పటికే మంత్రి కేటిఆర్ తో కూడా మాట్లాడారు అని సమాచారం. మరి సినిమాల షూటింగ్ కి తెలంగాణా సర్కార్ అనుమతులు ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికె అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా దాదాపుగా వాయిదా పడ్డాయి. వడ్డీలు కూడా భారీగా నిర్మాతలకు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: