సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూసిన అలనాటి అగ్ర హీరోయిన్ విజయశాంతి ఆ తర్వాత ఒక్కటి అంటే ఒక్కటి కూడా సినిమా ఆఫర్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదో ఆమెకు సినిమాల మీద ఆసక్తి లేదో ఎవరికి అర్ధం కావడం లేదు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో ఏ సినిమా కూడా చేయడం లేదు. ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్నా.. టీఆర్ఎస్ పార్టీ ఒంటి కాలితో లేచే విజయశాంతి ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు.
ఇక సరిలేరు నీకెవ్వరు తర్వాత ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ అంతా స్తబ్ధుగా ఉంది. ఇక రేపో మాపో షూటింగ్లు స్టార్ట్ కానున్నాయి. ఈ తరుణంలో ఆమెకు ఒక మంచి ఆఫర్ వచ్చింది అని అంటున్నారు. టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్ ఇవ్వడానికి ఒక చిన్న దర్శకుడు ముందుకు వచ్చారు. కాని సినిమాకు నిర్మాత మాత్రం అగ్ర నిర్మాత. సినిమా కూడా మంచి హీరోతోనే అయినా... చిన్న సినిమానే. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తో పూర్తి చెయ్యాలి అనేది ఆలోచన. ఈ సినిమాకు విజయశాంతి ని తీసుకోవాలి అని దర్శకుడు భావించారట.
ఆమెను అడగగా కోటి రూపాయలు అడిగింది. హీరో 90 లక్షల లోపే సినిమాను చేస్తుంటే ఆమె మాత్రం కోటి రూపాయలు అడిగింది. దీనితో ఇక ఆమె అవసరం లేదని ఆమె స్థానంలో మరొకరిని తీసుకోవాలి అని దర్శక నిర్మాతలు భావించారట. ఇక ఆమె అలా అడగడం చూసి... అమ్మో రాములమ్మ అంటూ షాక్ అయ్యారట నిర్మాత. తాను ఇలా ఎవరిని చూడలేదు అంటూ ఆయన షాక్ అయ్యారట. రాములమ్మకు ఇంత వయస్సు వచ్చినా ఆమె క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు అనేందుకు ఇదే నిదర్శనం.