ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  అమలవుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లన్ని ఆగిపోవడంతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సినీ నటులు అందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే . దీంతో ఇంటి దగ్గర ఉండి ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నాలు చేస్తూ.. సరికొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సినీ సెలబ్రిటీలు. ఇక దీనికి సంబంధించిన వీడియోని సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి అభిమానులను  అలరిస్తున్నారు . ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు లాక్ డౌన్  సమయంలో తాము కొత్తగా నేర్చుకున్నది ఏమిటి అనేది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సంచలనం సృష్టించారు. 

 

 

 తాజాగా బాలీవుడ్ నటి రిచా చాధ  లాక్ డౌన్  సమయంలో తాను ఏం నేర్చుకున్నాను అనే దానిపై సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. ఇక పౌష్టికాహారం కోసం సేంద్రియ ఉత్పత్తుల తో పెంచుతున్న ఒక కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుంది. సేంద్రియ కూరగాయలను ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లు అవుతున్నప్పటికీ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ప్రజలందరూ ఇంటికే పరిమితమవ్వటంతో..  కనీసం ఇంట్లో పని చేయడానికి కూడా ఎవరూ రాని పరిస్థితి ఈ నేపథ్యంలోనే... రిచా చాద  తోట పని కి కూడా వెళ్ళింది. ప్రస్తుతం ఒత్తిడి ఉన్న సమయంలో తోటపని ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. 

 

 

 నేను సర్టిఫైడ్ హిప్పి, ప్రకృతి ని  ఎప్పుడూ ప్రేమించే నేను తోటపని గురించి మరింతగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం అందరం లాక్ డౌన్  జీవితాన్ని గడుపుతున్నాము... తోటమాలి కూడా చుట్టూ లేకపోవడంతో నా సొంత ఆహారాన్ని పెంచుకోవడంలో నేను ప్రస్తుతం విజయం సాధిస్తున్నాను  అంటూ చెప్పుకొచ్చారు.తన  తోటలో  ఇప్పటికే ఎన్నో రకాల కూరగాయలు సహా ఆరోగ్యాన్నిచ్చే చెట్లు కూడా ఉన్నాయని అంతేకాకుండా పూల మొక్కలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. లాక్ డౌన్  సమయంలో కొత్త వంటలు నేర్చుకోవటమే కాదు డాన్స్ తో సహా చాలా సృజనాత్మక అంశాలపై కూడా  తాను  దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది వచ్చింది రిచా చాద .

మరింత సమాచారం తెలుసుకోండి: