సాయి పల్లవి.. మలయాళ 'ప్రేమమ్‌' చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత నానితో 'ఎంసీఏ'.. శర్వానంద్ సరసన 'పడి పడి లేచే మనసు'.. నాగసౌర్యతో 'కణం' చిత్రాల్లో నటించి అందర్నీ మెప్పించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. అందం - అభినయం - అదృష్టం అన్నీ కలబోసిన సాయి పల్లవి సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. దర్శకుడు వేణు ఉడుగుల ఈ ‘విరాటపర్వం’లో కొత్త కోణాలను చాలా ఇంట్రస్ట్ గా చూపించబోతున్నాడట. ముఖ్యంగా సాయిపల్లవి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని.. సినిమాలో ఆమె పాత్ర చనిపోతుందని.. చనిపోయే సీక్వెన్స్ వెరీ ఎమోషనల్ గా ఉండనుందని తెలుస్తోంది. మొన్న వేణు ఉడుగుల ఆమె పాత్ర గురించి చెప్తూ.. ‘అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది.. ఎవరి కోసం ఆమె నిరీక్షణ.. ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్నఅక్షరాలేమిటి.. ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి.. అంటూ సాయిపల్లవి పాత్ర గురించి హింట్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ఈ సినిమాలో ఆమె లుక్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకులను మరోసారి తన నటనతో ఫిదా చేసేలా కనిపిస్తోంది. 

 

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది. ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేయనున్నారు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో ఈ కథ సాగనుంది. అయితే సాయి పల్లవి పై కీలక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. కానీ, రానాకి సంబంధించిన సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. లాక్ డౌన్ అనంతరం చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాతో పాటు అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'లవ్ స్టోరీ' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నారాయణదాస్, కె. నారంగ్ మరియు ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుండి రిలీజైన సాయి పల్లవి లుక్ ఈ సినిమాలపై అంచనాలను పెంచేసాయి. ప్రస్తుతం నటిస్తున్న ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిస్తే క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ.. ఈ బ్యూటీ టాలీవుడ్ లో తన హవా చూపించే అవకాశం ఉందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: