నీది నాదే ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వేణు ఊడుగుల రానా దగ్గుబాటి హీరోగా విరాటపర్వం అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు నక్సలిజం బాగా ఎక్కువగా ఉండేది.

 

 

అప్పటి కథాంశాన్ని తీసుకుని పీరియాడిక్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటి ప్రియమణి నక్సలైట్ గా కనిపించనుంది. సాయి పల్లవి పుట్టినరోజుని పురస్కరించుకుని విరాటపర్వంలోని ఆమె లుక్ ని రివీల్ చేసింది చిత్రబృందం. ఈ లుక్ లో సాయి పల్లవి సాదాసీదా పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది. చేతిలో పెన్ను పేపరుతో, పక్కన బ్యాగు పెట్టుకుని అమరవీరుల స్థూపం కింద కూర్చుని ఎవరికోసమో ఎదురుచూస్తూ కూర్చుంది. చూడగానే విపరీతంగా ఆకర్షించిన ఈ పోస్టర్ గురించి ఎన్నో కథనాలు వచ్చాయి.

 

 

పోస్టర్ ని చూడగానే సినిమాలే ఎంత సహజంగా ఉంటుందో అర్థమైపోయింది. నక్సల్స్ గురించిన కథాంశం కాబట్టి ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుందని అర్థమ్ అవుతుంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా కీలకం అంట. జానపద కళాకారిణిగా కనపించనున్న సాయిపల్లవి పాత్ర చివర్లో చనిపోతుందని అంటున్నారు. అంటే విరాటపర్వం విషాదాంతం అని చెబుతున్నారు.

 

 

సాయిపల్లవి పాత్ర మరణించే ముందు చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉండనున్నాయని అంటున్నారు. వేణు ఊడుగులసినిమా ద్వరా ఒకప్పటి తెలంగాణ ప్రాంతాన్ని మనకి పరిచయం చేయబోతున్నాడట. నక్సల్స్ మీద ఇప్పటికి చాలా సినిమాలు వచ్చాయి. కానీ వేణు ఎంచుకున్న పాయింట్ మాత్రం చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాని సురేష్ బాబు, సుధాకర్ కల్సి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: