టాలీవుడ్ లో కథ బాగున్నా సరే ప్రేక్షకులకు దగ్గర కాలేని సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమా. ఈ సినిమా కథ చాలా మంది ప్రేక్షకులకు ఎక్కలేదు అనేది వాస్తవం. ఈ సినిమాలో మహేష్ నటన కొత్తగా ఉండటమే కాకుండా కథ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ఈ సినిమా మెజారిటి ప్రేక్షకులకు దగ్గర కాలేదు అనేది కూడా వాస్తవ౦. ఈ సినిమాలో మహేష్ బాబు నటన గురించి తర్వాత అవార్డులు ఇవ్వొచ్చు అనే విధంగా ఉన్నా సరే సినిమా మాత్రం ప్రేక్షకులకు ఏ విధంగా చూసినా సరే నచ్చలేదు అనే చెప్పవచ్చు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా లో ఉండే కొన్ని సనివేశాలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి అనేది వాస్తవం. అవి ఏంటీ అంటే విలన్ గా నటించిన మురళి శర్మ నటన. అతను నటించిన విధానం చూసి ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది అనేది వాస్తవం. ఆ సినిమాలో విలన్ ఎవరో కూడా చివరి వరకు తెలియదు. విలన్ అతనే అనేది కూడా ప్రేక్షకులకు ఎక్కడా కూడా డౌట్ రాకుండా సినిమాను తీసుకొచ్చారు అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత మంచి కథలకు ఆదరణ పెరిగింది గాని కథల్లో ప్రయోగాలు ఉంటే మాత్రం చాలా మంది చేయడానికి ముందుకు రాలేదు అనేది అర్ధమైంది. 

 

ఇక ఆ సినిమాలో విలన్ నటన గురించే ప్రత్యేకంగా చెప్పుకున్నారు ప్రేక్షకులు. అతను ఎవరు అనే సస్పెన్స్ ప్రేక్షకులకు చివరి వరకు ఉంది అనేది వాస్తవం. ఆ సినిమాలో హీరోయిన్ అమృత రావు నటన కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది అనే చెప్పవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత మురలి శర్మ మంచి నటుడిగా పేరు కూడా తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: