అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది. రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరి మాస్ గెటప్ లో రామ్ చరణ్ ని చూపించిన సుకుమార్ ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఊరమాస్ గెటప్ లో చాలా నాటుగా చూపించాడు.

 

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. అల్లు అర్జున్ కెరీర్లో ఇదే మొదటి పాన్ ఇండియా చిత్రం. అందుకే ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నాడు సుకుమార్. పాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ నుండి నటులని తీసుకోనున్నారని సమాచారం. హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం శేషాచలం అడవుల్లోనే షూటింగ్ జరుపుకోనుంది.

 

అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కంటే ముందు నుండే అభిమానులు ఈ సినిమాపై చాలా ఎగ్జయింటింగ్ గా ఉన్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ కాకముందే అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్ ని రెడీ చేసి ఆహా అనిపించారు. ఇక పోస్టర్ రిలీజైనప్పటి నుండి వారి సందడి మామూలుగా లేదు. పుష్ప కథాంశానికి అనుగుణంగా పోస్టర్లు రెడీ చేసి వదులుతున్నారు. తాజాగా ఆయన అభిమానులు తయారు చేసిన పోస్టర్ కి మంచి స్పందన వస్తుంది.

 

 

పోలీసు జీపుపై కూర్చుని, చేతిలో చుట్టతో, వెనకాల పోలీసులని విరగ్గొట్టినట్టున్న పొస్టర్ పుష్ప సినిమా కథకి చాలా దగ్గరగా ఉంది. ఇది అధికారికంగా రిలీజ్ చేశారేమో అన్నంత రియలిస్టిక్ గా తీర్చిదిద్దారు. అభిమానుల హంగామా చూస్తుంటే దర్శకనిర్మాతలు ఒకవైపు సంతోషంగా ఉంటే, మరోవైపు వారి అంచనాలని అందుకోవడానికి ఒత్తిడి కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: