సాయిపల్లవి ఈమె ఎంచుకునే కథలే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈమె పెద్దగా మేకప్, ఎక్స్పోజింగ్ చేయకపోయినా ఈమెకుండే క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. కేవలం తన కంటి చూపు కురులను విరబోసుకుని ఆమె అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అట్టే కట్టిపడేస్తది. ఇక నటన విషయానికి వస్తే ఆమె పాత్రలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. డ్యాన్స్ స్టెప్పులతో అమాయకపు నటనతో ఈమె తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఇక సాయిపల్లవి యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నటనకు ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకులు ఉండరు.
రానా – సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ‘విరాటపర్వం’లో కొత్త కోణాలను చాలా ఇంట్రస్ట్ గా చూపించబోతున్నాడట దర్శకుడు. ముఖ్యంగా సాయిపల్లవి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని.. సినిమాలో ఆమె పాత్ర చనిపోతుందని..చనిపోయే సీక్వెన్స్ వెరీ ఎమోషనల్ గా ఉండనున్నట్లు సమాచారం. ఇటీవలె ‘వేణు ఉడుగుల’ తన సోషల్ మీడియా ద్వారా‘అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది ? ఎవరి కోసం ఆమె నిరీక్షిస్తుంది ఆమె ఒడిలోని డైరీలో ఏమి రాసి ఉంది? ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి? అంటూ వేణు సాయిపల్లవి పాత్ర గురించి మెసేజ్ చేశాడు.
కాగా తెలంగాణ ప్రాంతంలో అప్పటి కాలంనాటి 1990 సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయనున్నారట. ఇక నక్స్లైట్ ఉద్యమం నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఇందులో సాయిపల్లవి నక్స్లైట్ పాత్రలో కనిపించనుందట. అయితే సాయి పల్లవి పై కీలక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. కానీ, రానాకి సంబంధించిన సీన్స్ మాత్రం ఇంకా షూట్ చేయాల్సి ఉంది. లాక్ డౌన్ కారణంగా అన్ని షూటింగ్లకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.