టాలీవుడ్ లోకి ఫిదా సినిమా తో అడుగు పెట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. తన నటన, డ్యాన్స్ లతో అశేష అభిమానులను సంపాదించుకుంది. అచ్చతెలుగు ఆడ పిల్లలా కనిపించే ఈ అందాల ముద్దుగుమ్మ కేరళ కుట్టి. తెలుగులోనే కాక హింది, మలయాళం, తమిళ నాట కూడా తనదైన గుర్తింపు సంపాదించుకుంది. స్కిన్ షోలకు తావివ్వకుండా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటుంది. ఈ రోజుల్లో ఇండస్ట్రీ లో రాణించాలంటే స్కిన్ షో చేయక తప్పదు అనుకుంటారు అందరు. 

 

ఏ విధమైన స్కిన్ షో చేయక పోయినా సాయి పల్లవి వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సాయి పల్లవి. సాయి పల్లవి ప్రస్తుతం  వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం సినిమాలో కీలక రూల్ చేస్తుంది. హీరో గా రానా నటిస్తున్నారు. అయితే సాయి పల్లవి ఒక నక్సలైట్ పాత్రలో కనిపించగా, రాణా పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక గాసిప్ బయటకు వచ్చింది. ఈ సినిమా యాంటి క్లైమాక్స్ తో ముగుస్తుందని తెలుస్తుంది.

 

 

1990 ల నాటి కథతో వస్తున్న ఈ సినిమా పై అటు చిత్ర పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా చివరిలో సాయి పల్లవి పాత్ర మరణిస్తుందని ఆమె మరణించిన సీన్స్ ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తుందని సినీ జనాల పుకార్లు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించక పోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సినిమాలో హీరో, హీరోయిన్ లు చనిపోతే కమర్షియల్ గా విజయం సాధించకపోయినా విమర్శకుల  ప్రశంసలు అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: