టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న సినిమాలకు కూడా హీరోయిన్ లు దొరకడం అనేది ప్రస్తుత పరిస్తితుల్లో చాలా కష్టంగా ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. చిన్న చిన్న సినిమాల కోసం ఇప్పుడు దర్శక నిర్మాతలు హీరోయిన్ ల కోసం కష్టపడే పరిస్థితి వచ్చింది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు మన తెలుగులో ఎటు చూసిన సరే ఇద్దరే హీరోయిన్ లు ఎక్కువగా కనపడుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునేది రష్మిక పూజ. వీళ్ళు ఇద్దరు మినహా ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరూ కూడా కనపడటం లేదు. 

 

ఇప్పుడు వీరిని పక్కన పెట్టి ఇద్దరు హీరోయిన్ లను హైలెట్ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ జనం. కీర్తి సురేష్ సహా సాయి పల్లవి ని ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లు గా మార్చే ప్రయత్నాలను చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఇద్దరూ భారీగా డిమాండ్ చేయడం తో ఇక వారి ఇద్దరినీ పక్కన పెట్టి వీరు ఇద్దరినీ తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు అని టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. రష్మిక పూజ తమకు ఉన్న డిమాండ్ ఆధారంగా ధరలను రోజు రోజు కి పెంచే ప్రయత్నం చేస్తున్నారట. 

 

దీని కారణంగా తాము నష్టపోయే అవకాశం ఉంది అనేది దర్శక నిర్మాతల హీరోల ఆలోచన గా ఉంది అనేది అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు వారు ఇద్దరినీ పక్కన పెట్టి కీర్తి సురేష్ ని సాయి పల్లవిని స్టార్ హీరో ల సినిమాల్లో తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మరి ఏ విధంగా వీళ్ళను తీసుకుని వస్తారు వీళ్ళు చేసే స్టార్ హీరోలు ఎవరు అనేది చూడాలి. ప్రస్తుతం కీర్తి కి మంచి డిమాండ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: