టాలివుడ్ లో జూనియర్ ఎన్టిఆర్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. నట వారసత్వం నుండి వచ్చినా తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించాడు జూనియర్. తారక్ వరుస విజయాలతో, చేతి నిండా సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉంటాడు. అయితే ఈ మధ్య కాలంలో సోదరుడు కళ్యాణ్ రాం తో కలిసి ఎన్టిఆర్ బ్యానర్లో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తారక్ ఆర్.ఆర్.ఆర్ సినిమా లో నటిస్తున్న సంగతి  తెలిసిందే. దీని తర్వాత కూడా వరుస సినిమాలు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. 

 

జూనియర్ ఎన్టిఆర్ అంటే యువతలో మంచి క్రేజ్ ఉంది. తారక్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తారు. అయితే తాజాగా ఎన్టిఆర్ నటిస్తున్న త్రిపులార్ గురించి  ఫ్యాన్స్  ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తారక్  సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తారని ఇప్పటికే క్లారిటి వచ్చింది. అయితే ఈ సినిమాకు విలన్ రోల్ లో నటించేందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అసలే ఎన్టిఆర్, త్రివిక్రం అంటే క్రేజీ కాంబినేషన్ . ఇక దీనికి తోడు సంజయ్ కూడా కలిస్తే ఇక ఆ సినిమా పై అంచనాలు భారీగానే ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. 

 

తారక్ 30 వ సినిమాను  కన్నబాబు, కళ్యాణ్ రాం కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్  పరిశీలనలో ఉన్నట్టు సినీ జనాల కథనం. ఈ సినిమాలో ఎన్టిఆర్ పాత్ర రాజకీయాలతో ముడి పడి ఉంటుందని సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక లాక్ డౌన్ తర్వాత నవంబర్ నుండి ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది దసరా నాటికి విడుదల చేసే విధం గా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఎన్టిఆర్ సినిమాలో సంజయ్ నటించేది నిజమే అయితే చాలా ప్లస్ అవుతుందని సినీ జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: