టాలీవుడ్ లో మెగా ఫ్యామిలికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో ఒక విధమైన ఆసక్తి. కొందరు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే ఎంత బిజీ పని అయినా పక్కన బెట్టి మరి సినిమా చూస్తారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నందున సినిమాలను పూర్తిగా పక్కన పెట్టారు. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్  మళ్ళి సినిమాల పై ఫోకస్ చేసారు. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్టు సమాచారం. 

 

పవన కళ్యాణ్ తన 28 వ సినిమాను క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్ళక ముందు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించాలని భావించింది. అయితే అప్పుడు కుదరక ఇప్పుడు ఆ సినిమాని లైన్ లో పెట్టారు. హరీష్ శంకర్  దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గురించి రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీటన్నిటికి ముగింపు ఇస్తూ ఇప్పుడు ఒక వార్త వినబడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మళయాళ నటి మనసా రాధాకృష్ణన్ నటిస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. 

 

అయితే మానస గురించి ఇంకా ఎటువంటి  అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన వార్తలు ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కూడా గబ్బర్ సింగ్ కాంభో లో వస్తున్నందున ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ప్రారంభించడానికి చిత్ర యూనిట్ రంగం సిద్దం చేస్తున్నట్టు కథనం. పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు వరుస సినిమాలతో పవన్ కళ్యాణ్  ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: