దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజ్ దేశంలో సంచలన వార్తగా మారింది. అదేవిధంగా ఈ వార్తతో సరి సమానంగా ఎవరు ఊహించని విధంగా రానా ప్రముఖ హైదరాబాద్ డిజైనర్ వెడ్డింగ్ ప్లానర్ మిహికా బజాజ్ తో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టడం దానికి రానా తల్లితండ్రులు అంగీకరించినట్లుగా వార్తలు రావడం క్షణాలలో ఈ రెండు వార్తలు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య హాట్ టాపిక్ గా మారాయి.


అయితే రానా పెళ్ళి చేసుకోబోతున్నాడు అని వచ్చిన వార్తలు మటుకు ప్రస్తుతం లాక్ డౌన్ పిరియడ్ లో సినిమాల షూటింగ్ లు లేక ఖాళీగా ఉన్న ప్రభాస్ పై ఒత్తిడి పెంచడం ఖాయం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ లిస్టులో రానా కు కూడ పెళ్ళి అయిపోతే ఇక మిగిలేది ప్రభాస్ మాత్రమే. 


దీనితో ప్రస్తుతం షూటింగ్ లు లేక ఇంటిలో అందుబాటులో ఉన్న ప్రభాస్ పై అతడి కుటుంబ సభ్యులు ముఖ్యంగా కృష్ణంరాజు ప్రభాస్ పెళ్ళి గురించి బాగా ఒత్తిడి పెంచే ఆస్కారం ఉంది అంటూ కొందరు రానా పెళ్ళికి సంబంధించిన న్యూస్ ను పరిశీలిస్తున్న ఇండస్ట్రీ వ్యక్తులు అభిప్రాయ పడుతున్నారు. దీనికితోడు ‘బాహుబలి’ తరువాత రానా ప్రభాస్ ల మధ్య చాలామంచి సాన్నిహిత్యం కూడ పెరిగిపోయింది. 


ఇలాంటి పరిస్థితులలో రానా పెళ్ళి నిర్ణయం ప్రభాస్ మనసును మార్చే ఆస్కారం ఉంది. తెలుస్తున్న సమాచారంమేరకు రానా మిహికా చాలా క్లోజ్ గా కొంతకాలంగా ఉంటున్న విషయం సినిమా తారల పై వార్తలు వ్రాసే మీడియాకు కూడ తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఈ విషయంమై సురేశ్ బాబు స్పందిస్తూ వీరిద్దరి పెళ్ళి ఈ సంవత్సరంలోనే జరుగుతుంది అని చెప్పడంతో కరోనా హడావిడి తరువాత రానా తన పెళ్ళిని ఘనంగా జరుపుకుంటాడా లేదంటే కరోనా తెచ్చిన మార్పులు వల్ల అతి తక్కువ మందితో తన పెళ్ళి సింపుల్ గా చేసుకుంటాడా అన్నది సస్పెన్స్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: