టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బడా నిర్మాతల్లో దిల్ రాజు. తాను నిర్మించిన 'దిల్' సినిమాతో 'దిల్ రాజు'గా మారిపోయిన వెంకట రమణా రెడ్డి టాలీవుడ్‌ లో తిరుగు లేని నిర్మాతగా కొనసాగుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి వరుస చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటున్నాడు. తాను ఇప్పటి వరకు టాలీవుడ్ దాదాపు అందరి హీరోలతోనూ సినిమాలు చేసి విజయాల్ని అందుకున్నాడు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే అని పలు మార్లు ప్రస్తావించారు. కానీ పవర్ స్టార్ రాజకీయాల్లో బిజీ అయిపోయి సినిమాలకు దూరం అయ్యాడు. దీంతో దిల్ రాజు డ్రీమ్.. డ్రీమ్ లాగే మిగిలిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ' వకీల్ సాబ్'. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించిన 'పింక్' రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్' 'ఎంసీఏ' వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 

 

అయితే శ్రీరామ్ వేణుపై ఎంత నమ్మకం లేకపోతే పవన్ లాంటి స్టార్ హీరోతో ఒక కం బ్యాక్ ప్రాజెక్ట్ ను అప్పగిస్తారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు అందరికి కలిగిన అనుమానం కూడా అదే. పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ ని హ్యాండిల్ చేయగలడా అని. ఇప్పుడు ఆ నమ్మకం నిజమేనా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎందుకంటే ఇదే దర్శకునితో మళ్ళీ మరో భారీ చిత్రాన్ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందులోను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఏదేమైనా వేణు శ్రీరామ్ పై దిల్ రాజుకు అంత నమ్మకం ఉందంటే మనోడు మామూలు టాలెంటెడ్ కాదని అర్థం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: