తెలుగులో కొన్ని కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా జానూ. సమంతా శర్వానంద్ హీరో లు గా వచ్చిన ఈ సినిమా చాలా వరకు అంచనాల తోనే వచ్చింది. ఈ సినిమా సమంతా కెరీర్ లో అతి పెద్ద విజయం సాధిస్తుంది అని భావించారు చాలా మంది. కాని అనూహ్యంగా ఈ సినిమా ఫ్లాప్ కావడం కనీసం అంచనాలను కూడా అందుకునే విధంగా లేకపోవడం తో చాలా మంది అభిమానులు బాధ పడ్డారు కూడా. ఈ సినిమాను సరిగా తీయలేదు అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. 

 

ఈ సినిమాను టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో తీసి ఉంటే మంచి విజయం సాధించింది ఉండేది అనేది ప్రేక్షకుల మాట. ఇక్కడి ప్రేక్షకులకు కొన్ని కథలు అంత బాగా నచ్చకపోవచ్చు అని అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయింది అని కొందరు కామెంట్స్ చేసారు కూడా. అయితే ఈ సినిమా తర్వాత రీమేక్ సినిమాలు అంటే టాలీవుడ్ జనాలు బాధ పడ్డారు. భయపడ్డారు కూడా. తమిళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని దిల్ రాజు కూడా ఈ సినిమాలో భారీగా పెట్టుబడులు పెట్టారు. కాని అది సాధ్యం కాలేదు అనే చెప్పాలి. 

 

సినిమా తర్వాత సామంత దాదాపుగా సినిమాలకు దూరం గానే ఉంది అని అర్ధమవుతుంది. ఆమె అవకాశాలు వచ్చినా సరే ఇప్పుడు సినిమా లు చేయడానికి మాత్రం సిద్దంగా లేదు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. శర్వానంద్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. కాని అది సాధ్యం కాలేదు. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా మాత్రం చాలా మందికి నిరాశ ను కలిగించింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: