ఎనభయ్యో దశకంలో దక్షిణాదిలో టాప్ హీరోయిన్లుగా రాణించిన వారిలో సుహాసిని, ఖుష్బూ, రాధిక, ఊర్వశి ముందువరుసలో ఉంటారు. వీరంతా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో నటించిన వారే. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్,, ఇలా దాదాపు దక్షిణాది భాషల్లోని టాప్ స్టార్స్ అందరితో వీరు హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నలుగురు ప్రధాన పాత్రల్లో తమిళ్ లో ‘ఓ అంద నాట్కళ్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై ఓ లేటెస్ట్ అప్డేట్ రివీల్ అయింది.

 

 

ఎనభైల్లో వీరు ప్రధాన పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నాలుగు సినిమాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళ సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ ఈ సినిమా తెరకెక్కించారు. వీరు నలుగురు నటించిన నాలుగు హిట్ చిత్రాల్లోని వీరి పాత్రలకు కొనసాగింపుగా ఈ కథ అల్లుకుని తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాళ భాషల్లోనూ ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో దాదాపు 80శాతానికి పైగా ఆస్ట్రేలియాలో తెరకెక్కించారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దక్షాణాది భాషల్లోని సినీ ప్రేక్షకులుకు నచ్చుతుందని దర్శకుడు జేమ్స్ వసంతన్ అంటున్నాడు.

IHG

 

అప్పట్లోని వీరి పాత్రల ఆధారంగా ప్రస్తుతం వీరి జీవితం ఎలా కొనసాగుతుందనే అంశంపై చిత్ర కథ ఉంటుందని అంటున్నాడు. సినిమాలో వీరితో పాటు ఖుష్బూ భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్ కూడా నటించాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడ్డాక ఈ సినిమా విడుదల కానుంది. నలుగురు సీనియర్ హీరోయిన్లు కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: