ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ ఇప్పుడు భారత్ లో కూడా వస్తుంది.  బాలీవుడ్ లో ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తి చేసుకుంది.  కండల వీరడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఇక తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని, సీజన్ 3 కి అక్కినేని నాగార్జున హూస్ట్ గా వ్యవహరించారు.  అయితే సీజన్ 4 కి కూడా నాగార్జున హూస్ట్ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పుడు  4వ సీజన్ కి సంబంధించిన సన్నాహాలు మొదలైనట్టుగా తెలుస్తోంది.  ఇంతకుముందు మాదిరిగానే ఈ సారి కూడా ఒక్కో కేటగిరి నుంచి ఒక్కో సెలబ్రిటీని ఎంపిక చేయనున్నారని అంటున్నారు.

 

ఈ నేపథ్యంలో  రియాలిటీ షోలో పోటీదారులుగా ఉండవలసిన సభ్యుల కోసం నిర్వాహకులు ఎంపిక ప్రక్రియను ప్రారంభించారట. ఈ సారి కొత్త జాబితాలో కాస్త డోస్ పెంచారని.. ప్రేక్షకులకు బాగాదగ్గరైన వారినే తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సారి  జాబితాలో 'అల్లరి' నరేశ్ .. 'సుడిగాలి'  సుధీర్ .. నందూ .. తాగుబోతు రమేశ్ .. ఝాన్సీ .. తదితరుల పేర్లు ఉన్నాయని అంటున్నారు. కొంతమందితో సంప్రదింపులు పూర్తికాగా, మరి కొందరితో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో సత్తా చాటుతున్న బ్యూటీ  వర్షిణి . 

 

ఈ విషయంపై వర్షిణి స్పందిస్తూ .. "నిజానికి నేను సీజన్ 2, సీజన్ 3 లోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టవలసి వుంది. కానీ అప్పుడు డేట్స్ సర్దుబాటుకాకపోవడం వలన కుదరలేదు. ఇక సీజన్ 4 కోసం నన్ను సంప్రదిస్తే మాత్రం తప్పకుండా వెళతాను  అని చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడికి నిజంగా చాన్స్ వస్తే చివరిదాకా ఉంటుందా? మద్యలే ఎలిమినేట్ అవుతుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: