బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఏది చేసినా సంథింగ్ స్పెషల్ అంటారు. ఆయన ఎక్కువగా ఏ విషయంలోనూ కాంట్రవర్సీల జోలికి వెళ్లరు. అందుకే ఆయన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. గతకొంత కాలంగా వరుస విజయాలు అందుకుంటున్నారు అమీర్ ఖాన్. తాను నటించే సినిమా కోసం ఎంత కష్టమైన పడతారు.. ఆ పాత్రకు తగ్గట్టుగా తయారు అవుతారు. లగాన్ సినిమా కోసం ఓ పల్లెటూరి వాడిలా కనిపించినా.. దంగల్ సినిమాలో ఎలా కనిపించారో అందరికీ తెలిసిందే. ఇలా పాత్రను బట్టి తన హావభావాలు, రూపు రేఖలు మార్చుకుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఆయన ఎంతో మంచి వారని అంటుంటారు.
అందుకే అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ దగ్గర దాదాపు 25 ఏళ్ళ పాటు అసిస్టెంట్గా పని చేసిన అమోస్(60) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. స్వయంగా అమీర్ దంపతులే ఆయనని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. అమోస్ తో ఆయనకు ఉన్న అనుబంధం ఎంటో అమీర్ ఖాన్ చెప్పకనే చెప్పారు. ఇంత క్లి్ష్ట సమయం.. ఐన వారు కూడా అందుబాటులో ఉండలేని దారుణమైన పరిస్థితి కరోనా వల్ల వచ్చింది. కానీ అమీర్ ఖాన్ మాత్రం తన అసిస్టెంట్ కోసం కదలిరావడం చూసి అందరూ ఒకింత ఆశ్చర్యపోయినా.. ఆయన మంచి తనానికి ఫిదా అయ్యారు.
అమోస్కి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమోస్ మరణంగా అమీర్, అతని భార్య కిరణ్ రావు దిగ్భ్రాంతికి గురయ్యారు. అతనని చాలా మిస్ అవుతున్నట్టు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ముంబైలో అమోస్ అంత్యక్రియలు జరగగా, ఈ కార్యక్రమానికి అమీర్, కిరణ్ రావు ఇద్దరు హాజరయ్యారు. మాస్క్లతో కనిపించిన వీరిద్దరు కూడా విషాదంలో మునిగిపోయారు.