టాలీవుడ్ లో నేను శైలజ తో అలరించి మహానటి తో ప్రభంజనం సృష్టించి అశేష అభిమానులను సంపాదించుకుంది కీర్తి సురేష్. సహజమైన అందం తో నటనలోని నైపుణ్యాన్ని మెరుగు పరచుకుంటూ  తన కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ప్రేక్షకుల మనసుల్లో నిలుపుకుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ భామ కేరళ కుట్టి. మహానటి సినిమా తో తెలుగులోనే కాక తమిళం లో కూడా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు అవాక్కయ్యారు.

 

బొద్దుగా, ముద్దుగా ఉండే కీర్తి సన్నగా, పీలగా అయిపోయింది. ఇది చూసిన ఫ్యాన్స్ బొద్దుగానే బాగున్నావు కదా ఎందుకింత సాహసం అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం బికినీ కోసమేమో అని, టు పీస్ లో కనిపించేందుకు అంటూ రకరకాల కామెంట్స్ ప్రచారం చేస్తున్నారు. తెలుగు మిస్ ఇండియా సినిమా లో ఇలా కనిపిస్తుందా.. కీర్తి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ పై కీర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది బికినీ వేసేందుకు కాదు.. కేవలం ఆరోగ్యంగా ఉండేందుకు అని చెబుతుంది. 

 

అయితే ఇండస్ట్రీలో ఈ విధంగా బికినీలు వేయడానికి కథానాయికలు తీవ్రమైన కసరత్తులు చేస్తారు. బికినీ, టు పీస్ లు వేయడం అనేది చాలా కష్టం తో కూడుకున్న పని. దీని కోసం ఎల్లప్పుడు శరీరాన్ని స్లిమ్ గా ఉంచాలి. ఇండస్ట్రీలో దీని కోసం అనుష్క, నయన తార, నమిత వంటి బొద్దు గుమ్మలు సైతం ఎంతో కటినమైన వ్యాయామాలు చేసారు. అయితే గతంలోనే కీర్తి నా శరీరానికి పట్టుచీరలు, మోడరన్ ఔట్పుట్ మినహా మిగతావి సూట్ కావని చెప్పినట్టు, అలాంటివి అసలు దగ్గరకు రానీయనని చెప్పింది. స్కిన్ షో చేయాల్సి వస్తే సినిమాల్లో నటించడం మానేస్తానని చెప్పిందని సినీ జనాల కథనం.

మరింత సమాచారం తెలుసుకోండి: