ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలపై  సోషల్ మీడియాలో క్రేజీ రూమర్స్ షికారు చేస్తున్నాయి.. ఫ్యాన్స్ లో.. కామన్ ఆడియన్స్ లో ఇంట్రస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. స్టార్ హీరోలు.. వారి సినిమాలు.. వాటి గురించి ఎప్పుడెప్పుడు ఏ న్యూస్ వస్తుందా అని.. ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో స్టార్ హీరో సినిమా గురించి వార్త గుప్పుమనగానే.. అది వైరస్ కంటే ఫాస్ట్ గా వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు మన తెలుగు స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలలో ఫలానా స్టార్ అంటా అని క్రేజీ రూమర్స్ షికార్ చేస్తున్నాయి.

 

ప్రస్థుతం ఆచార్య మూవీ చేస్తోన్న చిరంజీవి... నెక్ట్స్ మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను రీమేక్ చేయబోతున్నాడు. మోహన్ లాల్, పృద్వీరాజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీలో.. పృద్వీరాజ్ మోహాన్ లాల్ రైట్ హ్యాండ్ గా నటించాడు. తెలుగులో ఈ మూవీని సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఇక విషయం ఏమిటంటే.. ఈ మూవీలో చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ నటించబోతున్నట్టు నెట్టింట్లో న్యూస్ వైరల్ అవుతోంది. పృధ్వీరాజ్ నటించిన క్యారెక్టర్ సల్మన్ తో చేయించాలని మెగా హీరోలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకు ముందు 150 మూవీలో చేయాల్సింది ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. దాంత్ ఈ క్యారెక్టర్ కు సల్మాన్  ఒకే చెప్పాడన్న న్యూస్ వైరల్ అవుతోంది.

 

ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్థుతం ప్యాన్ వరల్డ్ మూవీ ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్నాడు. ఈ మూవీతో బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ పరిచయం కాబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ ను డైరెక్ట్ గా బాలీవుడ్ మూవీతో పరిచయం చేయాలని... స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ చూస్తున్నట్టున్యూస్ హల్ చల్ చేస్తోంది. పౌరాణిక పాత్రలకు తారక్ బావుంటాడని.. అందుకే.. ఎన్టీఆర్ తో పౌరాణిక సినిమా చేయాలని సంజయ్ చూస్తున్నట్టు సోషల్ మీడియా వార్త. ఇక ప్రస్థుతం ఆలియాతో గంగూభాయి చేస్తున్న బన్సాలీ.. ఈ ప్రాజక్ట్ తరువాత తారక్ ను అప్రోచ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: