పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడని ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ పాటికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజై ఉండేది. రెండేళ్ళుగా వెండితెర మీద చూడలేకపోయిన పవన్ కళ్యాణ్ ని చూసి మురిసిపోయేవారు. కరోనా వల్ల అన్ని షెడ్యూల్స్ మారిపోయాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేం. కరోనా ఉధృతి ఎప్పుడు తగ్గుతుందో తెలియకుండా ఉంది.

 

వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయ్యాక క్రిష్ సినిమాలో నటించనున్నాడు. వకీల్ సాబ్ కి సమాంతరంగా క్రిష్ సినిమాలో పాల్గొన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల వల్ల ముందుగా వకీల్ సాబ్ ని పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. క్రిష్ మూవీ మొఘలుల కాలం నాటి కథాంశంతో తెరకెక్కనుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా, మొదటి పీరియాడికల్ డ్రామాగా ఉండనుందని చెబుతున్నారు.

 

క్రిష్ మూవీ పూర్తికాగానే గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. అభిమానులందరూ వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం బాగా ఎదురుచూస్తున్నారు. గబ్బర్ సింగ్ వంటి సంచలనం విజయం అందించిన దర్శకుడి కాంబినేషన్లో వస్తున్న మూవీ మరో సంచలనం కానుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ మానస నటించనుందని వార్తలు వచ్చాయి.

 

వీటిపై స్పందించిన హరీష్, ఇంకా హీరోయిన్ ని సెలెక్ట్ చేయలేదని, సోషల్ మీడియాలొ తాను అందుబాటులో ఉంటానన్ని, అనవసరంగా ఊహాగానాలు రాయొద్దని విజ్ఞప్తి చేశాడు. అయితే పవన్- హరీష్ కాంబోలో నటించే హీరోయిన్ ని ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు. కరోనావల్ల షెడ్యూల్స్ పూర్తిగా మారిపోవడంతో వీరిద్దరి కాంబోలో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియనపుడు ఇప్పుడే హీరోయిన్ ని సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: