ప్రభాస్  సినిమా అంటే గ్యాప్ .. గ్యాప్ అంటే ప్రబాస్ సినిమా అని అందరూ ఫీలయ్యేలా లేట్ గా సినిమాలు చేస్తున్నాడు . కానీ ఈ సారి మాత్రం అలా కాదు. రెండేళ్లకోసారి సినిమా చేసే ప్రభాస్ ఈ సారి రెండు సినిమాలు ఒకేసంవత్సరంలో రిలీజ్ చేస్తున్నాడు.  గ్యాప్ ఇచ్చి  సినిమాలు చేస్తున్న ప్రభాస్ మీద ఫ్యాన్స్ అందరూ అలిగారు. అందుకే ... డార్లింగ్స్ .. ఈ సారి మాత్రం ఇంత గ్యాప్ ఇవ్వను. ప్రతి సంవత్సరం సినిమా చేస్తాను అంటూ తన డైహార్డ్ ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశాడు ప్రభాస్. కానీ సేమ్  2 ఇయరస్ గ్యాప్ ని మెయింటెన్ చేస్తున్నాడు ప్రభాస్.

 

అప్పుడెప్పుడో 2015 లో బాహుబలి 1, 2017 లో బాహుబలి 2 సినిమాలు రిలీజ్  చేశాడు. మళ్లీ 2019 లో సాహో సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తే.. 2020 లో థియేటర్లలో మిస్ అవుతున్నాడు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.  అయితే అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. జాన్ సినిమా మాత్రం అంతకంతకూ డిలే అయిపోతోంది. ఎందుకంటే ప్రభాస్ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు, ప్యాన్ ఇండియా సినిమాలు చెయ్యడంతో మూవీ మేకింగ్ కూడా డిలే అయిపోతోంది. ఇలా  రెండేళ్లకో సినిమా చేస్తున్నప్రభాస్ ని చూసి డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్‌ కి సంవత్సరానికో సినిమా చేస్తానని చెప్పాడు.

 

లాస్ట్ ఇయర్ సాహో తో వచ్చిన ప్రభాస్ ఈ సంవత్సరం జాన్ సినిమాని రిలీజ్ చేసే ఛాన్స్ కనిపించడంలేదు. ఈ మద్య రెండు సంవత్సరాలకొకసారి సినిమాలు చేస్తున్న ప్రభాస్.. ఈ సారి మాత్రం ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు . జాన్ సినిమాతో పాటు నాగాశ్విన్ తో చెయ్యబోతున్న ప్యాన్ వరల్డ్ సినిమా కూడా నెక్ట్స్ ఇయర్ లోనే రిలీజ్ చేస్తున్నాడు రెబల్ స్టార్ . సో.. బాబు సినిమా ఎప్పుడా అని ఎదురుచూసే ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ కి  ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలతో  విజువల్ ఫీస్ట్ రెడీ చేస్తున్నాడు .వైజయంతీ మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైటింఫిక్  థ్రిల్లర్ మూవీఅక్టోబర్ లో స్టార్ట్ చేసి నెక్ట్స్ సమ్మర్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట ప్రొడ్యూసర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: