కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆచార్య. ఇక ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో చిరు తనయుడు రామ్చరణ్తేజ్ మరో కీలకపాత్రలో నటిస్తున్నాడని తెలిసిన తర్వాత ఈ సినిమా పై క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. కరోనా కారణంగా షూటింగ్లన్నిటికి కూడా బ్రేక్ పడ్డాయి. మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పటికే రామ్చరణ్ ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్లన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోవడంతో ఇండస్ట్రీ మొత్తం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చరణ్ తన సినిమా వదిలేసి ఈ సినిమాలో నటించడం అనేది కాస్త కష్టతరమైన పనే. ఇక ఈ విషయాన్ని చిత్ర దర్శకుడైన కొరటాల శివకి కూడా ఇప్పటికే అర్ధమయింది. ఇక రామ్చారణ్ ఈ చిత్రంలో నటించడం పైకొరటాల కూడా ఒక విషయాన్ని తెలిపారు.
ఇక కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల రామ్చరణ్ ఈ చిత్రంలో నటించడం కాస్త కష్టమే అన్నట్లుగా కొరటాల అంటున్నారు. దీంతో మెగాఫ్యాన్స్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్లయింది. ఇక తండ్రీ కొడుకులిద్దరూ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే బొమ్మ దద్దరిల్లాలిసిందే. అయితే కొరటాల చెప్పిన దాన్ని బట్టి మని నిజంగానే చరణ్కి కుదరకపోవచ్చు అన్న అనుమానాలు బాగానే వ్యక్తమవుతున్నాయి. ఇక మెగా ఫ్యాన్స్ ఈ విషయం పై కాస్త నీరసపడక తప్పదు. అయితే ఈ చిత్రానికి ఎందుకోగాని మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఏదో రకంగా కాస్త వార్తల్లో నానుతూనే వచ్చింది. ముందుగా ఈ చిత్రానికి అనుకున్న కెమెరామెన్ మారాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఇక హీరోయిన్ త్రిష హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ కాజల్ని అనుకుంటే ఆమెకూడా చేయదు అన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అవేమి నిజం కాదని మళ్ళీ కాజల్ మేనేజర్ క్లారిటీ ఇచ్చిరు. ఇక ఇందులో ఉండే కీలక పాత్ర కోసం రామ్చరణ్, మహేష్ వీళ్ళిద్దరి పేర్లు తెగ నలుగుతున్నాయి. మరి చివరికి ఇందులో ఎవరు సెట్ అవుతారో పూర్తిగా సెట్స్మీదకి వెళితేనేగాని చెప్పలేం.