కన్నడ బ్యూటీ రష్మిక ఆశలు అడియాశలయ్యాయి. ఆమె డ్రీమ్ కు కరోనా అడ్డంకిగా మారింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న ఆ బ్యూటీ.. ఓ కల మాత్రం 2020లో ఎలాగైనా తీర్చేసుకోవాలని అనుకుంది. దీనికి తగ్గట్టే సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తో పరిస్థితులు కలిసొచ్చాయి. ఇంతలో మహమ్మారిలా దూసుకొచ్చిన కరోనా రష్మిక టార్గెట్ పై నీళ్లు చల్లింది.

 

టాలీవుడ్ టాప్ త్రీ హీరోయిన్స్ లో రష్మిక కూడా ఉంటుంది. మిగతా ఇద్దరు టాపర్స్ పూజా హెగ్డే.. కియారా అద్వానీతో పోల్చుకుంటే.. రష్మిక రెమ్యునరేషన్ తక్కువ. ఈ ఏడాది సరిలేరునీకెవ్వరు.. భీష్మ లాంటి వరుస హిట్స్ తో రెమ్యునరేషన్ పెంచేద్దామనుకుంది. దీనికి తగ్గట్టే.. కోటిన్నర.. రెండు కోట్ల మధ్యలో ఉన్నట్టు మేనేజర్ తో సంకేతాలు కూడా పంపిందట. 

 

రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలన్న రష్మి క కలను కరోనా చెదరగొట్టింది. థియేటర్స్ మూతపడ్డాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా ఇండస్ట్రీ మళ్లీ ఎప్పుడు కోలుకుంటుందో తెలియడం లేదు. బడ్జెట్ ను తగ్గించుకోవాలని.. ఈ క్రమంలో రెమ్యునరేషన్ కూడా తగ్గించాలన్న అభిప్రాయానికి సినిమా ఇండస్ట్రీ వచ్చింది. దీంతో రష్మిక రెండు కోట్ల రెమ్యునరేషన్ కల కలగానే ఉండిపోయింది. 

 

రష్మిక ప్రస్తుతం తెలుగులో బన్నీ సరసన పుష్ప మూవీ చేస్తోంది. సరిలేరు నీకెవ్వరు హిట్ కంటే ముందే నవంబర్ లోనే పుష్ప ఓకే చేయడంతో.. కోటిమాత్రమే దక్కిందట. ఈ లెక్కన 2కోట్ల టార్గెట్ ను చేరువకావడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. కరోనా సర్దుమణిగి.. సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయా..ఎప్పుడు రెండు కోట్లు తీసుకుంటానా.. అన్న ఆశతో సినిమాలు చేస్తోంది రష్మిక.

 

మొత్తానికి కన్నడ బ్యూటీ రష్మిక ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. ఆ బాధలోనే కాలం గడిపేస్తోంది ఈ బ్యూటీ. మధ్యలో కరోనా వచ్చి తన డ్రీమ్ చెడగొట్టడాన్ని సహించలేకపోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: