టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా నటించిన ‘వర్షం’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన త్రిష ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది.  ఆమెకు ఇప్పటి వరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. మొదట మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన త్రిష తర్వాత తమిళ్ లో జోడి సినిమాతో హీరోయిన్ గా మారింది.  2004 లో ప్రభాస్ సరసన వర్షం సినిమాతో తెలుగు లో మంచి విజయం అందుకుంది. ఇలా తెలుగు, తమిళంలో వరుస విజయాలు అందుకూంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ,కన్నడ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించింది.  పదిహేనేళ్లు దాటినా ఈ అమ్మడు ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా ఉంటుంది.  గ్లామర్ పాత్రలకు ఇంకా సై అంటుంది.

 

ఆ మద్య మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ మూవీలో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీకి కొరటాల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.  త్రిషకు మంచి ఛాన్స్ వచ్చినా.. డేట్స్ విషయంలో సర్ధుబాటు కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది. అయితే ఆచార్య మిస్ అయిన మ‌రో సినిమాలో చిరు స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం త్రిష‌కి ద‌క్కింద‌ని టాక్. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ లూసిఫ‌ర్ రీమేక్‌ని నిర్మిస్తాన‌ని ఇప్ప‌టికే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే.  

 

ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష అయితే బాగా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ అనుకుంటున్నారట.  గతంలో చిరు తో స్టాలిన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.  ఈ ఛాన్స్ మాత్రం అస్స‌లు మిస్ చేసుకోవొద్ద‌ని త్రిష కూడా అనుకుంటుంద‌ట‌. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి.  చూడాలి  చిరు- త్రిష కాంబినేష‌న్ ఫిక్స్ అవుతుందా లేదా అనేది రానున్న రోజుల‌లో తేల‌నుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: