టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ సినిమా వస్తుంది అంటే జనాలకు ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసే వాళ్ళు. కాని ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఆయన ఇమేజ్ మసక బారింది అనే మాట అక్షరాలా నిజం. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో ఆయన గాడిలో పడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఇప్పుడు మరో యువ హీరో తో సినిమా చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా ఎంతో మంది కి లైఫ్ ఇచ్చింది. ద‌ర్శ‌కుడిగా వ‌రుస ప్లాపుల‌తో ఉన్న పూరి జ‌గ‌న్నాథ్ తో పాటు నిర్మాత‌గా చార్మీ, అటు హీరో రామ్‌, హీరోయిన్లు నిధి అగ‌ర్వాల్ లాంటి వాళ్ల‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. 

 

ఇక ఇప్పుడు పూరి ఇస్మార్ట్ జోష్ లో మ‌రో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు పూరి చార్మీ తో ఒక బయోపిక్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచార౦. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత ఆమె హాట్ భామగా మారి కెరీర్ నాశనం చేసుకున్న ఒక హీరోయిన్ జీవిత కథ ను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడానికి గానూ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని సమాచారం. కథ కూడా సిద్దంగా ఉంచుకున్నాడు అని తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరు అనేది స్పష్టంగా తెలియదు. టాలీవుడ్ తో పాటు తమిళంలో కూడా ఆమె ఫేమస్ అని, కాని ఆ తర్వాత కెరీర్ ని నాశనం చేసుకుంది అని ఆమె జీవితంలో ఉన్న కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది అని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: