టాలీవుడ్ లో చిరంజీవి సినిమాలు అనగానే ఒక క్రేజ్ అనేది ముందు నుంచి ఉంటుంది. ఇక ఆయన సినిమాల్లో ఉండే పాటలకు మంచి డిమాండ్ అనేది ముందు నుంచి ఉంది అనే మాట అక్షరాలా నిజం. ఆయన సినిమాల్లో ఉండే పాటలకు గాను బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా చాలా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రతీ పాట కూడా సూపర్ హిట్ అవుతూ ఉంటుంది. పాటల మీద దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఉంటారు అనేది వాస్తవం. ఇక ఆయన ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ ఇచ్చి కూడా మూడేళ్ళు దాటింది. 

 

ఈ నేపధ్యంలో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ కూడా ఇస్తున్నారు. ఆయన సినిమాలు చేసిన అంత వేగంగా రామ్ చరణ్ కూడా ఇప్పుడు సినిమాలను చేయడం లేదు అనేది వాస్తవం. ఆయన సినిమాల్లో  ఇప్పుడు పాటల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 15౦ లో ఉండే ఒక పాట టాలీవుడ్ ని ఊపేసింది. రత్తాలు రత్తాలు అంటూ చిరంజీవి వేసిన డాన్స్ కూడా ప్రేక్షకులకు బాగా బాగా నచ్చింది. ఆ సినిమాలో రాయ్ లక్ష్మీ మంచి డాన్స్ వేసారు. 

 

ఆ సినిమాలో ఆ పాట కు ఇప్పటికి పాపులారిటి ఉంది అనేది వాస్తవం. ఆ పాట తర్వాత చిరంజీవి సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ప్రాధాన్యత వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఇప్పుడు పాటలకు మంచి డిమాండ్ అనేది వచ్చింది అనే మాట నిజం. అందుకే చిరంజీవి కూడా తన సినిమాలో మంచి పాటలు ఉండే విధంగా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: