సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గతకొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించిన సిమ్రాన్ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి సరసన నటించింది. అయితే తాజాగా మరోసారి సిమ్రాన్ తెలుగు సినిమాల్లో కనిపించనుంది. ఒకప్పటి సీనియర్ హీరోయిన్లందరూ నేటి హీరోలకి తల్లులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్ లో సిమ్రాన్ కూడా చేరనుంది.


ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ ఆ తర్వాత వచ్చిన కుమారి ౨౧ ఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ ఏదీ లేదు. ప్రస్తుతం అతడి కెరీర్ చాలా దయనీయంగా మారింది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన లవర్, ఇద్దరిలోకం ఒకటే చిత్రాలు కూడా ఫ్లాప్ అవడంతో రాజ్ తరుణ్ మార్కెట్ బాగా తగ్గింది.

 

ప్రస్తుతం ఒరేయ్ బుజ్జిగా సినిమా విడుదలకి రెడీగా ఉంది. ఈ సినిమా విడుదలయ్యి హిట్ టాక్ వస్తేగానీ రాజ్ తరుణ్ కెరీర్ ముందుకు సాగదు. అయితే కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే ఒరేయ్ బుజ్జిగా సినిమా ఇంకా విడుదల అవకముందే రాజ్ తరుణ్ కి మరో అవకాశం వచ్చింది. కొత్త దర్శకుడు సంతోష్ మోహన్ వీరంకి దర్శకత్వంలో హీరోగా అవకాశం వచ్చిందని అంటున్నారు.

 

ఈ సినిమలోనే రాజ్ తరుణ్ కి అమ్మగా సిమ్రాన్ నటించనున్నట్లు చెబుతున్నారు. రాజ్ తరుణ్ ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్ గా కనిపించనుండగా, సిమ్రాన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.  ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ సిమ్రాన్ ఈ పాత్రని ఒప్పుకున్నట్లయితే తెలుగులో ఆమెకి మంచి కమ్ బ్యాక్ వచ్చినట్టే. మరి ఏం జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: