టాలీవుడ్ లో ఒక్క సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో, హీరోయిన్లు ఉన్నారు. ఎప్పటి నుంచో నటిస్తున్నా ఒక్క హిట్ కోసం ముఖం వాచేలా ఎదురు చూసే నటులు కూడా ఉన్నారు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో ఒకేసారి స్టార్ డమ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా.. భానుమతి హైబ్రీడ్ పిల్ల.. ఒక్కటే పీస్ అంటూ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించింది మాలీవుడ్ బ్యూటీ సాయిపల్లవి. వాస్తవానికి సాయిపల్లడి తెలుగు లో డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొంది.. అప్పట్లోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాలీవుడ్ లో ప్రేమమ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకొని తెలుగు లో ఫిదాతో అచ్చమైన తెలుగు అమ్మాయిగా అందరి మనసు దోచింది.
తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ సంపాదించింది. ఆ మద్య రెండు కోట్ల ఆఫర్ వచ్చినా కూడా యాడ్స్ పేరుతో జనాలను మోసం చేయలేని రిజక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలో నేను పెళ్లి చేసుకోనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా కెరియర్ పైనే వుంది. పెళ్లి చేసుకొని కెరీర్ కి పులిస్టాప్ పెట్టుకునే ఆలోచన అస్సలు లేదని చెప్పింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.
తనకు అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరం కావడం నాకు ఇష్టం ఉండదు. మా అమ్మానాన్నలు ఎక్కడ వుంటే అక్కడ వాళ్లతో పాటే ఉండిపోవాలని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. పారితోషికం ఎంత ఇస్తానని చెప్పినా, కథ - పాత్ర నచ్చకపోతే చేయకపోవడం సాయిపల్లవి ప్రత్యేకత. పాత్ర ఎలాంటిదైనా చాలా సహజంగా .. తేలికగా చేసేయడంలో ఆమె సిద్ధహస్తురాలు అంటారు.