టాలీవుడ్ లో అఖిల్ సినిమా ఇప్పటి వరకు సరైన స్థాయిలో విజయం సాధించలేదు. అక్కినేని వంశం నుంచి మూడో త‌రం వార‌సుడిగా.. అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు బిరుదుతో గ్రాండ్ గా సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత అఖిల్ కు ఒక్క‌టంటే ఒక్క హిట్ కూడా లేదు. అఖిల్ అన్న నాగ చైతన్య నాలుగు హిట్స్ కొట్టాడు గాని అఖిల్ మాత్రం ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు స‌మంత‌ను పెళ్లి చేసుకున్నాక చైతు క్రేజ్.‌.  రేంజ్ వేరేగా ఉన్నాయి. టాలీవుడ్ లో అఖిల్ సినిమాలకు ఆదరణ లేకపోవడం కూడా ఒక కారణం. ఇప్పుడు ఇతను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఎలా అయినా సరే మే లో విడుదల చెయ్యాలి అనుకున్నారు. 

 

అఖిల్ తొలి సినిమా నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నా ఫ‌లితం మాత్రం అనుకున్న ట్టుగా రావ‌డం లేదు. మూడు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా ప్లాప్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత అతను వంశీ పైడిపల్లి తో ఒక సినిమా ప్లాన్ చేసాడు. లేదా కొరటాల శివ తో సినిమా చేయించడానికి నాగార్జున ఒప్పించారు. కాని ఇప్పుడు లాక్ డౌన్ తో అటు ఆచార్య సినిమా ఆగిపోయింది. వంశీ పైడిపల్లి ని రామ్ చరణ్ లైన్ లో పెట్టాడు. దీనితో అఖిల్ కి ఏ సినిమా చెయ్యాలో అర్ధం కావడం లేదు. కొత్త దర్శకుడి తో రిస్క్ వద్దు అనేది నాగార్జున ప్లాన్ గా ఉందని టాలీవుడ్ లో టాక్. 

 

కొడుకుని ఎలా అయినా మంచి దర్శకుడి చేతిలో పెట్టి లైన్ లో పెట్టాలి అని భావిస్తున్నాడు. కాని ఇప్పుడు అది సాధ్యం కావడం లేదు. ఇప్పుడు అఖిల్ చేస్తున్న సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నారు నాగార్జున. మరి ఈ సినిమా అయినా వస్తుందా లేక ఆగిపోతుందా అనేది చూడాలి. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. సినిమాలు కూడా ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: